Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేసిన పాకిస్థాన్ ఆటగాడు!

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (08:46 IST)
పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెర్ బాబర్ అజం సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టీ20 మ్యాచ్‌లలో అమిత వేగంగా ఎనిమిదివేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ స్థానంలో కొనసాగుతూ వచ్చిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. విరాట్ కోహ్లీ మొత్త 243 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, బాబర్ అజం మాత్రం 214 ఇన్నింగ్స్‌లలోనే ఎనిమిది వేల పైచిలుకు పరుగురు చేశాడు. 
 
గురువారం కరాచీ వేదికగా పర్యాటక ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో బాబప్ చెలరేగి సెంచరీ (110 నాటౌట్) చేశాడు. దీంతో తన వ్యక్తిగత రికార్డును నెలకొల్పడమేకాకుండా, జట్టును కూడా గెలిపించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సం చేసింది. 
 
టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసి ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపును సొంతం చేసుకుంది. మరో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ కూడా 88 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త జీవితం కోసం వస్తే ఎడారి రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయారు.. విషాదాంతంగా ప్రేమజంట కథ!!

చెన్నై వెళ్తున్నారా? మీ సెల్ ఫోన్ జాగ్రత్త (video)

సిగాచి రసాయన పరిశ్రమ ప్రమాదం... 42కి చేరిన మృతుల సంఖ్య

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి, కోమాలో కుమార్తె: వైద్యం చేయించలేక తండ్రి ఆత్మహత్య

కుమార్తె కోసం సముద్రంలో దూకిన తండ్రి.. (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments