Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశాన్ని కాపాడండయ్యా.. కాశ్మీర్ మనకెందుకయ్యా: షాహిద్ అఫ్రిది

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (18:39 IST)
కాశ్మీర్ గురించి భారత్- పాకిస్థాన్‌ల మధ్య పెద్ద రచ్చే జరుగుతున్న నేపథ్యంలో.. కాశ్మీర్ గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వున్న నాలుగే నాలుగు ప్రావిన్స్‌లనే సరిగ్గా చూసుకోలేకపోతున్నాం. ఇక మనకెందుకు కాశ్మీర్ అంటూ షాహిద్ అఫ్రిది ఘాటుగా వ్యాఖ్యానించాడు. 


లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాశ్మీర్ గురించి పాకిస్థాన్ మరిచిపోవాలని.. పాకిస్థాన్‌ను మంచిగా చూసుకుంటేనే చాలునని.. ప్రభుత్వానికి హితవు పలికాడు.
 
వున్న నాలుగు ప్రావిన్స్‌లను ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అభివృద్ధి చేయాలని అఫ్రిది డిమాండ్ చేశాడు. అంతటితో ఆగకుండా.. ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడం తమ ప్రభుత్వాలకు చేత కాలేదని అఫ్రిది ఘాటుగా ధ్వజమెత్తాడు. కాశ్మీర్ లోయలో ప్రజలు చనిపోవడం కూడా తనకెంతో బాధగా వుందని.. కాశ్మీర్‌ గురించి పాకిస్థాన్ మరిచిపోవడమే కాదు.. భారత్‌కు కూడా కాశ్మీర్ ఇవ్వొద్దని అఫ్రిది అన్నాడు. కాశ్మీర్ ప్రత్యేక దేశం కావాలని వ్యాఖ్యానించాడు. 
 
కాశ్మీర్ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని.. మానవత్వం వెల్లివిరియాలని అఫ్రిది కామెంట్ చేశాడు. కానీ అఫ్రిది వ్యాఖ్యలపై పాక్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇంకా భారతీయులు, క్రికెట్ ఫ్యాన్స్ అఫ్రిది మాటలపై ఎలా సోషల్ మీడియాలో స్పందిస్తారో కూడా వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

తర్వాతి కథనం
Show comments