Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన మిథాలీరాజ్.. నెం.1గా నిలిచింది..

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన మిథాలీరాజ్.. నెం.1గా నిలిచింది..
, మంగళవారం, 13 నవంబరు 2018 (12:21 IST)
మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసింది. 47 బంతుల్లో ఏడు ఫోర్లతో 56 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ (2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) రికార్డు సృష్టించి... అందరి కంటే ముందు వరుసలో నిలిచింది. 
 
మరోవైపు తాజా రికార్డుతో పురుషుల క్రికెట్‌లో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) రికార్డును మిథాలీ అధిగమించినట్లయింది. రోహిత్‌ తర్వాత సారథి విరాట్‌ కోహ్లీ (2,102 పరుగులతో) భారత్‌ తరఫున రెండో స్థానంలో ఉన్నాడు.
 
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత మహిళల జట్టు గురువారం ఐర్లాండ్‌ జట్టుతో తలపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక సెకన్.. ఒక పంచ్.. ఆ ప్లేయర్ తలరాతను మార్చేసింది...