Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్ట్ డ్రా : నిజంగా సిగ్గుచేటు అంటున్న విరాట్ కోహ్లీ

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (14:55 IST)
భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య నాటింగ్‌హ్యామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టెస్టు డ్రాగా ముగిసింది. టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. 209 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట చివరికి ఓ వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన కోహ్లీ సేన పటిష్ట స్థితిలో నిలిచింది. 
 
157 పరుగులు చేయాల్సి ఉండగా, చివరి రోజు వర్షం కారణంగా ఆట ప్రారంభం కాలేదు. పదే పదే వర్షం పడుతుండడంతో మ్యాచ్ డ్రాగా ముగిసినట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నిరాశాజనకంగా ముగిసింది.
 
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయగా, భారత్ 278 పరుగులు నమోదు చేసింది. ఇంగ్లండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులు చేసింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఈ నెల 12 నుంచి జరగనుంది.
 
అయితే, ఇంగ్లండ్‌తో తొలి టెస్టు చివరి రోజు వర్షం ఆటంకం కలిగించడం, మ్యాచ్ డ్రా కావడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందిస్తూ, కొంత అసహనం వ్యక్తం చేశాడు. గెలిచే స్థితిలో ఉండి కూడా మ్యాచ్ డ్రా కావడం ఆవేదనకు గురి చేసిందన్నాడు. 
 
‘‘ఇది నిజంగా సిగ్గుచేటు. లక్ష్య ఛేదనలో మేం మంచి స్థితిలో ఉన్నాం. గెలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. కానీ, మూడో రోజో.. నాలుగో రోజో పడుతుందనుకున్న వర్షం.. ఐదో రోజు పడి మా ఆశలపై నీళ్లు చల్లింది. ఆ రోజు మొత్తం ఆట ఆడే వీలు లేకుండా పోయింది’’ అని వ్యాఖ్యానించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

తర్వాతి కథనం
Show comments