Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతన్నలకు శుభవార్త చెప్పిన భారతీయ స్టేట్ బ్యాంకు

Advertiesment
Kisan Credit Card
, ఆదివారం, 8 ఆగస్టు 2021 (12:37 IST)
దేశంలోని రైతులకు భారతీయ స్టేట్ బ్యాంకు శుభవార్త చెప్పించింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకుగా ఎస్బీఐవున్న విషయం తెల్సిందే. ఈ బ్యాంకు ఇపుడు రైతుల కోసం సరికొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. రైతులు ఇకపై కిసాన్ క్రెడిట్ కార్డు రివ్యూ కోసం బ్యాంకుకి వెళ్లాల్సిన పని లేదని, ఆ పనిని తమతమ ఇళ్లలోనే పూర్తి చేసుకోవచ్చని తెలిపింది. 
 
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా రైతులు వారి కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం యోనో యాప్‌లో క్రిషి అనే ఆప్షన్‌ను ఎస్బీఐ తీసుకొచ్చింది. దీని ద్వారా రైతులు ఈ సేవలు పొందొచ్చు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఎస్బీఐ తెలిపింది. 
 
బ్యాంకుకి వెళ్లే పని లేకుండా తమ కస్టమర్ల సౌలభ్యం కోసం ఎస్బీఐ యోనో యాప్ తెచ్చింది. దీని ద్వారా పలు రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. రైతులకు సులభంగానే రుణాలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కేసీసీ స్కీమ్ తీసుకొచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోలీసులు దిగ్బంధంలో అమరావతి : ర్యాలీకి అనుమతి నిరాకరణ