Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ్యాచ్‌ల రద్దు.. అలాంటి వారిని ఆదుకునేందుకు సిద్ధం: గణేశ్ అయ్యర్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:06 IST)
భారత దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపైనే ఆధారపడి ఉన్న చిన్నపాటి ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. వీరిలో స్థానిక మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించే వారు, స్కోరర్లు ప్రధానంగా ఉన్నారు. 
 
ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు, బీసీసీఐ మాజీ అంపైర్ గణేశ్ అయ్యర్ ముందుకొచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో కష్టాల్లో పడ్డ వారిని ఆదుకొనేందుకు తన మిత్రులతో కలిసి ఆయన 'లెండింగ్ ఏ హ్యాండ్' అనే సంస్థను ఏర్పాటు చేశారు.
 
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్‌లలో అంపైర్లుగా చేసేవారు రోజుకి రూ.2వేలు, స్కోరర్లు రూ.1,500 వేతనంగా అందుకుంటారని ఎంసీఏ తెలిపింది. ఇప్పుడు మ్యాచ్‌లు లేకపోవడంతో వారికి రాబడి లేకుండా పోయింది. వీరిని ఆదుకొనేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశామని అయ్యర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ రూ.2.5లక్షలు విరాళాల రూపంలో వచ్చాయి. ఈ విరాళాలను అందించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అయ్యర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments