మ్యాచ్‌ల రద్దు.. అలాంటి వారిని ఆదుకునేందుకు సిద్ధం: గణేశ్ అయ్యర్

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (19:06 IST)
భారత దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాప్తి చెందడంతో క్రీడా పోటీలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపైనే ఆధారపడి ఉన్న చిన్నపాటి ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. వీరిలో స్థానిక మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరించే వారు, స్కోరర్లు ప్రధానంగా ఉన్నారు. 
 
ఇలాంటి వారిని ఆదుకునేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ మాజీ సభ్యుడు, బీసీసీఐ మాజీ అంపైర్ గణేశ్ అయ్యర్ ముందుకొచ్చారు. క్రికెట్ మ్యాచ్‌లు నిలిచిపోవడంతో కష్టాల్లో పడ్డ వారిని ఆదుకొనేందుకు తన మిత్రులతో కలిసి ఆయన 'లెండింగ్ ఏ హ్యాండ్' అనే సంస్థను ఏర్పాటు చేశారు.
 
ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే టోర్నమెంట్‌లలో అంపైర్లుగా చేసేవారు రోజుకి రూ.2వేలు, స్కోరర్లు రూ.1,500 వేతనంగా అందుకుంటారని ఎంసీఏ తెలిపింది. ఇప్పుడు మ్యాచ్‌లు లేకపోవడంతో వారికి రాబడి లేకుండా పోయింది. వీరిని ఆదుకొనేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశామని అయ్యర్ వెల్లడించారు. ఇప్పటి వరకూ రూ.2.5లక్షలు విరాళాల రూపంలో వచ్చాయి. ఈ విరాళాలను అందించేందుకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అయ్యర్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ లోయ అందాలు చూద్దామని కేబుల్ కార్ ఎక్కితే గాలిలో వేలాడదీసింది, 300 మంది కేకలు, అరుపులు

ముగ్గురు ADMK ఎమ్మెల్యేలు రాజీనామా, పావులు కదుపుతున్న విజయ్, అన్నాడీఎంకె అంతమేనా?

ఎబోలా వైరస్‌పై ఆంధ్రప్రదేశ్ అప్రమత్త చర్యలు

మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

రెండోసారి కూతురే పుట్టిందని 10 నెలల పసికందును హతమార్చిన కన్నతండ్రి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

DilRaju: తెలంగాణా ఎగ్జిబిటర్లకు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన హామీ ఏమిటో తెలుసా !

వేణు ఉడుగుల ఆవిష్కరించిన సింగిల్ రాజు టైటిల్, గ్లింప్స్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Colors Swathi: పెళ్ళి చేసుకోవడం కంటే కుక్కను పెంచుకోవడం బెటర్.. స్వాతి

తర్వాతి కథనం
Show comments