Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి ఇవ్వాల్సిన బకాయిలు ఎంత..? 24 గంటల్లో వివరణ ఇవ్వాలన్న సుప్రీం

Webdunia
శుక్రవారం, 3 మే 2019 (13:09 IST)
ఆమ్ర‌పాలీ రియ‌ల్ సంస్థ‌కు 2009 నుంచి 2016 వ‌ర‌కు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తనకు రావాల్సిన డబ్బు ఇంకా చెల్లించలేదనీ ధోని పిటిషన్‌ దాఖలు చేశారు. 
 
దీంతో పాటుగా.. రాంచీలోని ఆమ్రాపాలీ ప్రాజెక్టులో ధోనీ బుక్‌ చేసుకున్న పెంట్‌హౌజ్‌ను కూడా తనకు అధికారికంగా అప్పగించలేదని ఆయన ఆరోపించారు. తనకు రావాల్సిన సొమ్ముతో పాటు.. పెంట్‌ హౌజ్ను త‌న‌కు అప్పగించేలా ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ధోనీ సుప్రీంను కోరాడు.
 
ఈ నేపథ్యంలో ధోనీకి ఎంత డబ్బు ఇవ్వాల్సి ఉందో చెప్పాలంటూ ఆమ్ర‌పాలీ రియ‌ల్ ఎస్టేట్ సంస్థకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ధోనీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ధోనీకి ఇవ్వాల్సిన మొత్తం ఎంతో చెప్పాలని ఆదేశించింది. సంస్థకు ధోనీకి మధ్య జరిగిన అన్ని లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరణను 24 గంటల్లో ఇవ్వాలంటూ తేల్చి చెప్పింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments