Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. నేను కాదు.. ధోనీ

Webdunia
బుధవారం, 3 మే 2023 (19:01 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌పై గత కొన్ని రోజులుగా వివిధ రకాలైన వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇదే అతడికి చివరి ఐపీఎల్‌ అంటూ ప్రతి సీజన్‌కు ముందు వార్తలు రావడం.. దానిపై పలువురు వివిధ రకాలుగా స్పందించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా లక్నోతో బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడింది. ఈ సందర్భంగా ధోనీ తన రిటైర్మెంట్‌ వార్తలపై మరోసారి స్పందించాడు.
 
ఈ మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన ధోనీ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఈ సందర్భంగా 'మీ చివరి సీజన్‌ను ఆస్వాదిస్తున్నారా?' అని కామెంటేటర్‌ ధోనీని ప్రశ్నించాడు. దీనికి మహీ స్పందిస్తూ.. 'ఇది నా చివరి ఐపీఎల్‌ అంటూ మీరు నిర్ణయించుకున్నారు.. నేను కాదు' అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు. 
 
అనంతరం కామెంటేటర్‌.. స్టేడియంలో ధోనీ కోసం భారీగా వచ్చిన ప్రేక్షకులను చూపిస్తూ.. 'మహీ వచ్చే ఏడాది కూడా ఆడేందుకు వస్తాడు' అని అన్నాడు. ఈ వ్యాఖ్యలు ధోనీ అభిమానుల్లో జోష్‌ నింపాయి.
 
ఇటీవల ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ తన ఫేర్‌వెల్‌పై సరదా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా సొంత మైదానం అయినప్పటికీ.. భారీగా అభిమానులు ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కేకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌ అనంతరం ధోనీ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందుకు వీరంతా సీఎస్‌కే జెర్సీలో వచ్చినట్లుందని నవ్వుతూ అన్నాడు.
 
ఇక చెన్నై ఇప్పటి వరకూ ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. నేడు లక్నోపై నెగ్గితే 12 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురం పలావ్స్ అండ్ బిర్యానీస్, హైదరాబాదులో హోటళ్లు ప్రారంభం

దేశంలోకి ముందుగానే నైరుతి రుతుపవనాలు.. ఎక్కువ వర్షపాతం నమోదు

హత్రాస్‌ జిల్లాలో తొక్కిసలాట- 80కి చేరిన మృతుల సంఖ్య

రైతు ఆత్మహత్య.. సీరియస్‌గా తీసుకున్న సీఎం.. రూ.25లక్షలు డిమాండ్

కుమార్తెను గర్భవతిని చేసిన కిరాతక తండ్రికి 101 యేళ్ళ జైలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

విరాజి కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చాయి : హీరో వరుణ్ సందేశ్

తర్వాతి కథనం
Show comments