Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్ 2023: ఉత్కంఠ పోరులో ఆఖరి బంతికి పంజాబ్ విజయం - చెన్నైకు షాక్

raza
, ఆదివారం, 30 ఏప్రియల్ 2023 (20:12 IST)
ఐపీఎల్ 2023లో మరో ఉత్కంఠ భరితపోరు సాగింది. ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ లెవెన్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. చివరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరి బంతికి మూడు పరుగులు కాల్సివుండగా, బ్యాటర్ రజా సమయస్ఫూర్తితో ఆడి ఫోర్ కొట్టడంతో పంజాబ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగీంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ధోని సేన నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన పంజాబ్‌ చివరి వరకూ పోరాడింది. ఆఖరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో సికిందర్ రజా సమయస్ఫూర్తితో ఆడాడు. దీంతో విజయం పంజాబ్‌ ఖాతాలో పడింది. పంజాబ్‌ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్  (42, 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లివింగ్ స్టోన్‌ (40, 24 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు), శిఖర్‌ ధావన్‌ (28, 15 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించారు. సామ్‌ కరన్‌ (29, 20 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ ఫర్వాలేదనిపించాడు. 
 
కాగా, ఈ మ్యాచ్‌ను తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా వీక్షించారు. సాధారణంగా తెల్ల చొక్కా, పంచెకట్టులో దర్శనమిచ్ ఆయన.. ఈ మ్యాచ్‌ కోసం క్యాజువల్ దుస్తుల్లో కనిపించారు. అలాగే, సొంతగడ్డపై సీఎస్కే 200 పరుగులు చేసినప్పటికీ ధోనీ సేన ఓడిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ధోనీ కీపింగ్ చేస్తున్న సమయంలో మోకాలి గాయంతో ఇబ్బందిపడినట్టు కనిపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంజాబ్ కింగ్స్‌పై లక్నో ఘనవిజయం.. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్