Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీనా మజాకా... ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఎందుకు? (video)

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (17:17 IST)
ప్రపంచ కప్‌కు ముందు స్వదేశంలో ఐపీఎల్ సీజన్ సందడి ఆరంభంకానుంది. ఈనెల 23వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ పోటీలు మొదలుకానున్నాయి. ఈ సీజన్ ప్రారంభ పోటీల్లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగనుంది. అంటే భారత క్రికెట్ జట్టుకు చెందిన కెప్టెన్, మాజీ కెప్టెన్‌ల మధ్య జరిగే సమరంగా దీన్ని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగనుంది.
 
ఇందుకోసం డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ చెన్నైలోని త‌మ సొంత గ్రౌండ్‌ ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా జ‌ట్టుతో క‌లిసి బ్యాటింగ్‌, కీపింగ్ సాధ‌న చేస్తున్నాడు. మైదానంలో చెన్నై టీమ్‌తో పాటు ధోనీ ఉన్నాడ‌ని తెలుసుకున్న అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.
 
కేవ‌లం ఆట‌గాళ్ల ప్రాక్టీస్‌ను చూసేందుకు సుమారు 12 వేల మందికి పైగా ఫ్యాన్స్ మైదానానికి వ‌చ్చిన‌ట్లు చెన్నై ప్రాంఛైజీ పేర్కొంది. ఇక బ్యాట్ తీసుకొని మైదానంలోకి ధోనీ అడుగుపెట్ట‌గానే ధోనీ.. ధోనీ అంటూ కేక‌లు పెట్టారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సీఎస్‌కే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

తర్వాతి కథనం
Show comments