Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీనా మజాకా... ఫ్యాన్స్ ఎగబడ్డారు.. ఎందుకు? (video)

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (17:17 IST)
ప్రపంచ కప్‌కు ముందు స్వదేశంలో ఐపీఎల్ సీజన్ సందడి ఆరంభంకానుంది. ఈనెల 23వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ పోటీలు మొదలుకానున్నాయి. ఈ సీజన్ ప్రారంభ పోటీల్లో తొలి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగనుంది. అంటే భారత క్రికెట్ జట్టుకు చెందిన కెప్టెన్, మాజీ కెప్టెన్‌ల మధ్య జరిగే సమరంగా దీన్ని భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కూడా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగనుంది.
 
ఇందుకోసం డిఫెండింగ్ ఛాంపియ‌న్స్‌ చెన్నై సూప‌ర్ కింగ్స్ చెన్నైలోని త‌మ సొంత గ్రౌండ్‌ ఎంఏ చిదంబ‌రం స్టేడియంలో క‌స‌ర‌త్తు ప్రారంభించింది. ఆ జ‌ట్టు కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా జ‌ట్టుతో క‌లిసి బ్యాటింగ్‌, కీపింగ్ సాధ‌న చేస్తున్నాడు. మైదానంలో చెన్నై టీమ్‌తో పాటు ధోనీ ఉన్నాడ‌ని తెలుసుకున్న అభిమానులు స్టేడియానికి పోటెత్తారు.
 
కేవ‌లం ఆట‌గాళ్ల ప్రాక్టీస్‌ను చూసేందుకు సుమారు 12 వేల మందికి పైగా ఫ్యాన్స్ మైదానానికి వ‌చ్చిన‌ట్లు చెన్నై ప్రాంఛైజీ పేర్కొంది. ఇక బ్యాట్ తీసుకొని మైదానంలోకి ధోనీ అడుగుపెట్ట‌గానే ధోనీ.. ధోనీ అంటూ కేక‌లు పెట్టారు. ఈ సందర్భంగా తీసిన వీడియోను సీఎస్‌కే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments