Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జెర్సీల్లో మార్పులు.. ఫిట్‌గా వుందన్న ధోనీ.. కోహ్లీ కూడా ఇక మార్చేది లేదన్నాడు..

Advertiesment
MS Dhoni
, శనివారం, 2 మార్చి 2019 (11:59 IST)
ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా క్రికెటర్లు ధరించే జెర్సీలో మార్పులు చోటుచేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. ప్రపంచ కప్‌కు సంబంధించిన కొత్త జెర్సీని విడుదల చేశాడు. ఈ కార్యక్రమంలో మహేంద్ర సింగ్ ధోనీ, పృథ్వీ షా, రహానే, జస్‌ప్రీత్ బూమ్రా, హర్మన్ ప్రీత్ కౌర్ తదితరులు పాల్గొన్నారు. 
 
భుజంపై చిన్నపాటి తేలికపాటి గోధుమ రంగును.. బీసీసీఐ లోగో.. ఇండియా అనే అక్షరాలు ముదురు గోధుమ రంగుతో కూడిన ఈ జెర్సీ.. క్రికెట్ ఫ్యాన్సుకు బాగానే నచ్చేసింది. ఈ జెర్సీ  1983 ప్రపంచ కప్ సందర్భంగా భారత జట్టు ధరించిన రంగు, 2007 టీ-20 నెగ్గినప్పుడు భారత్ ధరించిన జెర్సీలను మిళతమై వుంటుందని.. ఈ రెండు జెర్సీల రంగుల ఆధారంగా కొత్త జెర్సీని రూపొందించినట్లు రోహిత్ శర్మ వెల్లడించాడు. 
 
ఈ క్రమంలో ధోనీ జెర్సీ సైజ్ కూడా తగ్గింది. ఇప్పటి వరకు గీఔ సైజు జెర్సీతో భారీగా కనిపించేవాడినని.. ప్రస్తుతం అది ఔకు మారిందని.. ఇదే జెర్సీని కొనసాగిస్తానని.. ధోనీ ఇదే కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలిపాడు. ఇదే తరహాలో స్పందించిన కెప్టెన్‌ కోహ్లి తాను చాలా కాలంగా ''ఔ '' వాడుతున్నానని, అది ఇకపై మారదని సరదాగా వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ మీ శత్రువు కాదు... ఇంకా ఎంతకాలం రక్తం చిందించాలి : వసీం అక్రమ్