Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల్‌దేవ్ సరసన మహ్మద్ సిరాజ్! 39 యేళ్ల నాటి రికార్డు సమం

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (20:02 IST)
హర్యానా హరికేన్, భారత క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ సరసన భారత క్రికెట్ జట్టు బౌలర్ మహ్మద్ సిరాజ్ చేరారు. తద్వారా 39 యేళ్లనాటి రికార్డును సమం చేశారు. క్రికెట్ మక్కాగా ప్రసిద్ధిగాంచిన ఇంగ్లండ్‌లో లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఈ అరుదైన రికార్డును సిరాజ్ నెలకొల్పారు. 
 
ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ టూర్‌లో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిశాయి. తొలి టెస్ట్ డ్రాగా ముగియగా, లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ సంచలన విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ మహ్మద్ సిరాజ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు చొప్పున మొత్తం 8 వికెట్లు తీశారు. మొత్తం 126 పరుగులు ఇచ్చాడు. 
 
39 యేళ్ళ క్రితం కపిల్ దేవ్ ఇదేవిధంగా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఎనిమిది వికెట్లు తీసి 168 పరుగులు ఇచ్చాడు. అలాగే, 2007లో ఆర్పీ సింగ్ ఏడు వికెట్లు తీసి 117 పరుగులు ఇచ్చాడు. 1996లో వెంకటేష్ ప్రసాద్ ఏడు వికెట్లు తీసి 130 రన్స్ ఇచ్చాడు. 2014లో ఇషాంత్ శర్మ ఏడు వికెట్లు 135 పరుగులు ఇచ్చాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అనన్య నాగళ్ల లాంచ్ చేసిన 23 మూవీ కోసీ కోయ్యంగానే సాంగ్

తర్వాతి కథనం
Show comments