Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీనగర్ దన్మార్ ఏరియాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ దన్మార్ ఏరియాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం
, శుక్రవారం, 16 జులై 2021 (08:15 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు, భద్రత దళాలకు మధ్య ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 
 
కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని దన్మార్‌ ప్రాంతంలో ఉన్న ఆలమ్‌దార్‌ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. 
 
ఈ సందర్భంగా గాలింపు బృంధాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. మరణించినవారిని లష్కరే తొయిబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

26 నుంచి కొత్త రేషన్ కార్డులు : సీఎం కేసీఆర్ నిర్ణయం