Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

చత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత - మావోల హతం

Advertiesment
Encounter Break
, ఆదివారం, 25 జులై 2021 (14:28 IST)
తెలంగాణ సరిహద్దుల్లోవున్న ఛ‌త్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో తుపాకుల మోత మోగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఆదివారం తెల్లవారుజామున భీకరపోరు జరిగింది. ఈ ఘటనలో ఓ మావోయిస్టు ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోని సుక్మా జిల్లా చింతాగుఫా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 150, 131 బెటాలియన్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ భద్రతా దళాలు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను పసిగట్టిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఆ వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. 
 
ఈ ఘటనలో ఓ గుర్తు తెలియని మావోయిస్టు మృతి చెందినట్లు ఎస్పీ సునీల్ శర్మ ధృవీకరించారు. మావోయిస్టు మృతదేహంతో పాటు ఒక బర్మార్ తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మవోయిస్టుల వారోత్సవాల దృష్ట్యా పోలీస్ బలగాలు అడవుల్లో గాలింపు చ‌ర్య‌ల‌ను ముమ్మరం చేశాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కెనెడాలో సరికొత్త వైరస్ : పసుపు రంగులోకి మారిన నాలుక