Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌లో మన కుర్రోడు అదరగొట్టాడు : మంత్రి కేటీఆర్

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (08:21 IST)
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇపుడు బ్రిస్బేన్ వేదికగా చివరి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో కంగారులను భారత బౌలర్ మహ్మద్ సిరాజ్ బెంబేలెత్తించాడు. ఫలితంగా ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఆలౌట్ అయింది. పైగా, ఈ మ్యాచ్‌లో సిరాజ్ 19.5 ఓవర్లు వేసి 73 రన్స్ ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు నేలకూల్చాడు. దీంతో ఈ యువ బౌలర్ ప్రతిభను ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. 
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. "హైదరాబాదుకు చెందిన మన కుర్రాడు అదరగొడుతున్నాడంటూ" కేటీఆర్ ప్రశంసించారు. తండ్రిని కోల్పోయిన విషాదకర పరిస్థితిలోనూ ఈ విధంగా రాణించడం మామూలు విషయం కాదని కొనియాడారు. "నీ అద్భుత ప్రదర్శన భారత జట్టు ముందర సిరీస్ గెలిచే అవకాశాన్ని నిలిపింది. మీ నాన్న పై నుంచి దీవెనలు అందజేస్తూ నీ ఆటతీరు పట్ల ఖచ్చితంగా గర్విస్తాడు" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments