Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేంద్రుడి రికార్డు బద్ధలు.. సిక్సర్ల రారాజు రోహిత్

Webdunia
ఆదివారం, 18 ఏప్రియల్ 2021 (12:07 IST)
స్వదేశంలో జరుగుతున్న ఇండియ‌న్ ప్రిమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) పోటీల్లో భాగంగా ఓ అరుదైన రికార్డు నమోదైంది. ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌. ఈ క్ర‌మంలో అత‌డు చెన్నై సూప‌ర్‌కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని వెన‌క్కి నెట్టాడు. 
 
స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్ 32 ప‌రుగులు చేసిన సంగ‌తి తెలుసు క‌దా. అందులో అత‌డు రెండు సిక్స‌ర్లు బాదాడు. దీంతో ఐపీఎల్‌లో రోహిత్ శ‌ర్మ మొత్తం సిక్స‌ర్ల సంఖ్య 217కు చేరింది.
 
ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు కొట్టిన ఇండియ‌న్ ప్లేయ‌ర్‌గా ధోనీ (216) పేరు మీద ఉన్న రికార్డును రోహిత్ చెరిపేశాడు. ఓవ‌రాల్‌గా ఐపీఎల్‌లో అత్య‌ధిక సిక్స్‌లు బాదింది క్రిస్ గేల్ (351) కాగా, ఏబీ డివిలియ‌ర్స్ (237) త‌ర్వాతి స్థానంలో ఉన్నాడు. 
 
ఇక ధోనీ, రోహిత్ త‌ర్వాత విరాట్ కోహ్లి (201) ఉన్నాడు. ఇక కెప్టెన్‌గా టీ20ల్లో 4 వేల ప‌రుగుల రికార్డును కూడా ఇదే మ్యాచ్‌తో రోహిత్ అందుకున్నాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments