Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : భారత్ ముంగిట 273 రన్స్ టార్గెట్

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (18:22 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుని ప్రత్యర్థి జట్టును బ్యాటింగ్‌కు అహ్వానించింది. దీంతో కివీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 273 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టులో మిచెల్ 130, రచిన రవీంద్ర 75 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలించారు. వీరిద్దరూ జట్టు ఇన్నింగ్స్‌ను పునర్మించారు. 
 
19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ జట్టును రవీంద్ర - మిచెల్ జోడీ జాగ్రత్తగా ఆడుతూ మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడారు. ఫలితంగా మూడో వికెట్‌ను కివీస్ జట్టు 178 పరుగుల వద్ద కోల్పోయింది. కివీస్ జట్టులో మిగిలిన ఆటగాళ్లలో కాన్వే, హెన్రీలు డకౌట్‌ కాగా, యంగ్ 17, లాథమ్ 5, ఫిలిప్స్ 23, చాంపన్ 6, సత్నర్ 1, ఫెర్గ్యూసన్‌లు 1 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, బుమ్రాలు ఒక్కో వికెట్ తీశారు. 
 
ఇదిలావుంటే, ప్రపంచ కప్‌లో భారత తరపున అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ల జాబితాలో మహ్మద్ షమీ మూడో స్థానంలో నిలిచాడు. ధర్మశాల వేదికగా జరిగిన కివీస్ మ్యాచ్‌లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్రపంచ కప్‌లో షమీ తీసిన వికెట్ల సంఖ్య 32కు చేరింది. తద్వారా భారత లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 31 వికెట్ల ఫీట్‌ను అధికమించాడు. ఈ జాబితాలో జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. వీరిద్దరూ తలా 44 చొప్పున వికెట్లు తీశారు. ఇపుడు వీరిద్దరి తర్వాత షమీ చేఱాడు. జస్ప్రీత్ బుమ్రా 28 వికెట్లతో కుంబ్లే తర్వాతి స్థానంలో నిలిచాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

తర్వాతి కథనం
Show comments