Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ప్రపంచ కప్ : కివీస్‌తో మ్యాచ్ - టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (14:38 IST)
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, ఆదివారం భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక పోరు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో శార్దూల్ ఠాకూర్ స్థానంలో మహ్మద్ షమీకి చోటు కల్పించారు. అలాగే, చీలమండ గాయంతో జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు. 
 
అయితే, ఈ ప్రపంచ కప్ కోసం భారత్ ప్రతి మ్యాచ్‌లోనూ శార్దూల్ ఠాకూర్‌ను ఆడిస్తుండటం విమర్శల చెలరేగుతున్నాయి. దీంతో అతన్ని తప్పించి షమీని తుది జట్టులోకి తీసుకున్నాడు. అటు కివీస్ జట్టులో మార్పులేమీ చేయలేదు. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు భారత్, కివీస్ జట్లూ చెరో 4 మ్యాచ్‌లలో గెలుపొంది ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నాయి. దీంతో ఈ మ్యాచ్ అమితాసక్తి నెలకొంది. పైగా, ఈ రెండు జట్ల ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో హోరాహోరీ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
కాగా, టాస్ ఓడి ఫీల్డింగ్ ప్రారంభించిన కివీస్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 9 పరుగుల వద్ద ఉండగా, ఓపెనర్ కాన్వే వికెట్‌ను కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో అయ్యర్ క్యాచ్ పట్టడంతో డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం కివీస్ జట్టు స్కోరు 7.4 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఓపెనర్ యంగ్ 16, రవీంద్ర 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: జనసేన కార్యాలయంపై డ్రోన్ కలకలం.. భద్రత లోపాలపై పీకే ఫ్యాన్స్ ఆందోళన

YS Jagan: నియోజకవర్గాలకు కో-ఆర్డినేటర్లను నియమించిన జగన్

Iran: సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఇద్దరు జడ్జిలపై కాల్పులు.. మృతి

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పావలా శ్యామలకు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ లక్ష రూపాయల ఆర్థిక సాయం

పనిచేసే యువతితో సైఫ్ అలీఖాన్ రాసలీలలు, కోపమొచ్చి పొడిచిన ప్రియుడు?!!

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి సింగిల్ అగ్గిపుల్లె..రిలీజ్

ముగ్గురు కాలేజీ స్నేహితుల కథతో మ్యాడ్ స్క్వేర్ రాబోతోంది

నాస్తికులు-ఆస్తికులు అనే కాన్సెప్ట్‌ తో కన్నప్ప రూపొందింది : చిత్ర యూనిట్

తర్వాతి కథనం
Show comments