Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇర్ఫాన్‌ పఠాన్‌‌కి కోవిడ్ పాజిటివ్.. రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో ఆడిన వాళ్లకే..?

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (11:37 IST)
దేశంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. పేద, ధనిక అనే తేడాలు లేకుండా ఈ వైరస్‌ అందరికి సోకుతోంది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. ఇక తాజాగా భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్‌లో ప్రకటించాడు. 
 
లక్షణాలు లేకున్నా... పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. నిర్ధారణకు ముందే తాను స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని, అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపాడు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారంతా త్వరగా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. 
 
కాగా.. ఇటీవల రాయ్‌పూర్‌లో ముగిసిన రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో పాల్గొన్న ఆటగాళ్లకే కరోనా సోకుతోంది. ఇప్పటికే ఈ సిరిస్‌లో ఆడిన సచిన్‌, యూసుఫ్‌ పఠాన్‌, బద్రీనాథ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ సిరిస్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ కూడా పాల్గొనడం విశేషం.

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

తర్వాతి కథనం
Show comments