Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెపాక్ స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్న మాజీ కెప్టెన్!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (13:24 IST)
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్. ఈయన ప్రస్తుతం చెన్నైలోని చెప్పాక్కం స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తున్నారు. ధోనీ ఏంటి క్రికెట్ జట్టుకు రంగులు వేయడం అనే కదా మీ సందేహం... అయితే ఈ కథనం చదవండి. ఐపీఎల్ కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ నెల 31వ తేదీన ప్రాంభమవుతుంది. ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున బరిలోకి దిగనున్నారు. 
 
ఇందుకోసం చెపాక్ స్టేడియంలో గత నెల రోజులుగా ధోనీ ఈ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. సీఎస్కే క్రికెటర్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. రేయింబవుళ్లు ప్రాక్టీస్ చేస్తూ, స్టేడియానికి మరమ్మతులు చేసే పనుల్లో కూడా నిమగ్నమయ్యారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఉదయం స్టేడియంలోని కుర్చీలకు పెయింటింగ్ వేస్తూ కనిపించాడు. చెపాక్ స్టేడియాన్ని ఈ మధ్యే పునరుద్ధరించారు. అలాగే చాలా ఏళ్ల తర్వాత కొన్ని స్టాండ్లను కూడా ఉపయోగంలోకి తెచ్చారు. ఈ సీజన్ ఐపీఎల్‌లో అభిమానులను ఈ స్టాండ్లలోకి అనుమతించనున్నారు.
 
ఈ క్రమంలో స్టాండ్స్‌లోని కుర్చీలకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ధోనీ కూడా పసుపు, నీలం రంగు స్ప్రే పెయింట్ క్యాన్‌లతో బయటికి వచ్చి చెపాక్‌లో రెండు కుర్చీలకు పెయింట్ చేశాడు. ఈ వీడియోను సీఎస్కే తమ ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments