Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్ అలవోక విజయం - 8వ స్థానానికి పంజాబ్

Webdunia
గురువారం, 21 ఏప్రియల్ 2022 (09:36 IST)
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా బుధవారం రాత్రి ముంబైలో జరిగిన మరో లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ జట్టు నిర్ధేశించిన 116 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయిన ఛేదించింది. మరోవైపు, ఈ ఓటమితో పంజాబ్ కింగ్స్ లెవెన్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి దిగజారిపోయింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాట్స్‌మెన్లు వరుసగా క్యూ కట్టారు. జట్టులో జితేష్ శర్మ చేసిన 32 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. 
 
ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ 24, షారూక్ ఖాన్ 12, రాహుల్ చాహర్ 12 చొప్పున పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లలో ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేక పోయారు. ఫలితంగా ఆ జట్టు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. 
 
ఆ తర్వాత 116 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కేవలం 10.3 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ పృథ్వీషా 20 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 41 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 30 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిర్సర్ బాది 60 పరుగులు చేశారు. ఫలితంగా తొలి వికెట్‌కు ఏకంగా 83 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
 
షా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 12 పరుగులు చేసి వార్నర్‌కు అండగా నిలిచాడు. దీంతో ఢిల్లీ జట్టు 9 వికెట్లతో విజయభేరీ మోగించింది. బౌలింగ్‌ పొదుపుగా చేసిన కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments