ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు భారత పర్యటనలో ఉంది. ఈ పర్యటనలో ఇప్పటికే టెస్టు సిరీస్ పూర్తి చేసి ట్వంటీ20 సిరీస్ను ఆడుతోంది. ఈ సిరీస్లోని చివరి మ్యాచ్ 20వ తేదీన జరుగనుంది. అయితే, ఇంగ్లండ్తో త్వరలో జరగనున్న వన్డే సిరీస్కు భారత జట్టును బీసీసీఐ ఈ రోజు ప్రకటించింది.
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆ మూడు మ్యాచులు పూణెలోనే జరగనున్నాయి. మొదటి వన్డే ఈ నెల 23న, రెండో వన్డే 26న, మూడో వన్డే 28న జరుగుతుంది. కాగా, టెస్టు సిరీస్లో విజయం సాధించిన టీమిండియా ప్రస్తుతం జరుగుతోన్న టీ20ల్లోనూ విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లో ఇరు జట్లూ 2-2 తేడాతో సమ ఉజ్జీలుగా ఉన్నాయి. నిర్ణయాత్మక ఐదో టీ20పై ఉత్కంఠ నెలకొంది. నాలుగో టీ20 మ్యాచులో సూర్యకుమార్ అద్భుతంగా రాణించడంతో వన్డే సిరీస్లో చోటుదక్కింది.