Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీసీసీఐ కీలక నిర్ణయం.. ప్రేక్షక్షులు లేకుండా మ్యాచ్‌లు.. ఆ టోర్నీలు రద్దు?

Advertiesment
BCCI
, బుధవారం, 17 మార్చి 2021 (10:35 IST)
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న వినూ మాన్కడ్‌ ట్రోపీ సహా అన్ని విభాగాల క్రికెట్‌ టోర్నమెంట్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా అన్ని రాష్ట్రాల బోర్డులకు సమాచారం అందించారు. కరోనా ఉదృతంగా ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది.
 
అలాగే టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య 5 టీ20ల సిరీస్‌ అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టీ20లకు 50 శాతం ప్రేక్షకులను అనుమతించిన బీసీసీఐ.. కరోనా కారణంగా మిగతా మూడూ టీ20లతో పాటు రానున్న వన్డే సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించనుంది.

ఇప్పటికే మంగళవారం జరిగిన మూడో టీ20లో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరిగిందని.. మిగతా మ్యాచ్‌లు అలాగే నిర్వహిస్తామని గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. 
 
ఇక ఈ ఏడాది ఏప్రిల్ లో జరగనున్న ఐపీఎల్ 2021 సీజన్ 14పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఏప్రిల్ లోగా కరోనా ఉదృతి కోనసాగితే ఐపీఎల్ కూడా ప్రేక్షకులు లేకుండా నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాకుంటే ఇతర దేశంలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోందని సమాచారం. గత ఏడాది ఐపీఎల్-13 బయోబుడగ నీడలో యూఏఈలో నిర్వహించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమిండియాకి జరిమానా.. కారణం ఏమిటంటే..?