Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టు మహిళా వీరాభిమాని ఇకలేరు.. బీసీసీఐ సంతాపం

Webdunia
గురువారం, 16 జనవరి 2020 (14:53 IST)
భారత క్రికెట్ జట్టుకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. కానీ, ఆ 87 యేళ్ళ వృద్ధ మహిళా వీరాభిమానం మాత్రం ప్రత్యేకం. ఆమె జట్టు పట్ల చూపుతున్న ప్రేమకు టీమిండియాకు చెందిన అగ్ర క్రికెటర్లు ఫిదా అయిపోయారు. ఆమెతో ప్రత్యేకంగా సమావేశమై, ముచ్చటించారు. అలాంటి వీరాభిమాని ఇకలేరు. ఆమె లండన్‌లో మృతిచెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చారులత పటేల్. వయసు 87 యేళ్ళు. పుట్టింది పెరిగింది విదేశాల్లోనే. కానీ మాతృదేశంపై ఆమెకు వల్లమానిని ప్రేమ, మమకారం. అందుకే భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ఆడే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా ఆడుతూ ఉంటుంది. 
 
ఈమె తొలిసారి 1983లో లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అపుడు చారులత స్టేడియంలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇంగ్లండ్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతూ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ వస్తోంది. 
 
అ తర్వాత గత యేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లకు ఆమె హాజరవుతూ వచ్చింది. ఆ వయసులో కూడా ఆమె ఆనందం, ప్రోత్సాహం చూసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు ప్రత్యేకంగా ఆమెను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇటీవల అనారోగ్యంపాలైన ఆమె కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
భారత సంతతికి చెందిన చారులత, పుట్టింది, పెరిగిందీ విదేశాల్లోనే. 1975 నుంచి బ్రిటన్‌లో స్థిరపడిన ఆమె, అంతకుముందు దక్షిణాఫ్రికాలో ఉండేవారు. చారులత పటేల్ మృతిపట్ల బీసీసీఐ సంతాపాన్ని తెలిపింది. ఆమె ఎల్లప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments