Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పండగపూట సెంచరీలతో ఉతికి ఆరేసిన కంగారులు.. భారత్ చిత్తు

పండగపూట సెంచరీలతో ఉతికి ఆరేసిన కంగారులు.. భారత్ చిత్తు
, బుధవారం, 15 జనవరి 2020 (10:49 IST)
ముంబై వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కంగారులు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఫలితంగా భారత బౌలర్లను ఉతికి ఆరేశారు. దీంతో భారత్ నిర్ధేశించిన విజయలక్ష్యాన్ని ఓపెనర్లిద్దరే ఛేదించారు. ఈ విజయంతో ఈ వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
మంగళవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి వన్డే జరిగింది. ఇందులో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 49.1 ఓవర్లలో 255 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బ్యాట్స్‌మెన్లలో రోహిత్ శర్మ 10, శిఖర్ ధావన్ 74, రాహుల్ 47, కోహ్లీ 16, అయ్యర్ 4, పంత్ 28, జడేజా 25, ఠాకూర్ 13, షమి 10, కుల్దీప్ యాదవ్ 17 చొప్పున పరుగులు చేయగా అదనపు పరుగుల రూపంలో 11 రన్స్ వచ్చాయి. 
 
ఆ తర్వాత 256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఒక్క వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. జట్టు ఓపెనర్లు ఆరోన్ ఫించ్ 110 (నాటౌట్), డేవిడ్ వార్నర్ 128 (నాటౌట్)లతో సెంచరీలు మోత మోగించారు. ఫలితంగా భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్లు నిస్తేజంగా ఆకాశం వైపు చూస్తూ ఉండిపోయారు. ఈ సిరీస్‌లో రెండో వన్డే జనవరి 17న రాజ్‌కోట్‌ వేదికగా జరుగనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై వన్డే : సాహసం చేసిన ఆస్ట్రేలియా - భారత్ బ్యాటింగ్