వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన భారత క్రికెట్ జట్టు

Webdunia
గురువారం, 28 జులై 2022 (07:23 IST)
వెస్టిండీస్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ విజయం సాధించింది. దీంతో దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసింది. 
 
డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (42, 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్‌ కింగ్‌ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. 
 
మిగతా బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేయడంతో విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు తీయగా శార్దూల్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్‌, అక్షర్‌ పటేల్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. 
 
అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్థ సెంచరీతో రాణించాడు. అలాగే, శుభమన్ గిల్ (44) బాధ్యతాయుతంగా ఆడాడు. వీళ్లద్దరూ నిలకడగా ఆడటంతో భారత్ నిర్ణీత 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

జీమెయిల్‌కు మంగళం ... జోహో ఫ్లాట్‌ఫామ్‌కు స్వాగతం... కేంద్ర మంత్రి అమిత్ షా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venky 77: వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మల్లీశ్వరీ సీక్వెల్ !

Janhvi : రామ్ చరణ్, జాన్వీ కపూర్ పై పెద్ది కోసం పూణేలో సాంగ్ షూటింగ్

నాలుగు జన్మల కథతో మైథలాజికల్ చిత్రంగా గత వైభవ: ఎస్ఎస్ దుశ్యంత్

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి షాకిచ్చిన బాంబే హైకోర్టు

KRamp: ఫ్లవర్ లాంటి లవర్ ఉంటే లైఫ్ సూపర్ రా అంటూ K-ర్యాంప్ గీతం

తర్వాతి కథనం
Show comments