Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెస్టిండీస్‌ను వైట్ వాష్ చేసిన భారత క్రికెట్ జట్టు

Webdunia
గురువారం, 28 జులై 2022 (07:23 IST)
వెస్టిండీస్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో వన్డేలోనూ భారత్ విజయం సాధించింది. దీంతో దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో వైట్‌వాష్‌ చేసింది. 
 
డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్‌ 137 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులో మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌.. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ (42, 32 బంతుల్లో 5x4, 1x6), బ్రెండన్‌ కింగ్‌ (42; 37 బంతుల్లో 5x4, 1x6) మాత్రమే టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. 
 
మిగతా బ్యాట్స్‌మెన్‌ మొత్తం చేతులెత్తేయడంతో విండీస్‌ తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇక భారత బౌలర్లలో చాహల్‌ 4 వికెట్లు తీయగా శార్దూల్‌, సిరాజ్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ప్రసిద్ధ్‌, అక్షర్‌ పటేల్‌ తలా ఓ వికెట్‌ పడగొట్టారు. 
 
అంతకుముందు భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శిఖర్ ధావన్ (54 నాటౌట్) అర్థ సెంచరీతో రాణించాడు. అలాగే, శుభమన్ గిల్ (44) బాధ్యతాయుతంగా ఆడాడు. వీళ్లద్దరూ నిలకడగా ఆడటంతో భారత్ నిర్ణీత 36 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments