Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ వేదికగా లంక వన్డే మ్యాచ్ : సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో శ్రీలంక బోణీ కొట్టగా, రెండో వన్డేలో భారత్ విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ విశాఖ వేదికగా ఆదివారం జరుగన

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (20:05 IST)
స్వదేశంలో పర్యాటక శ్రీలంక జట్టుతో భారత్ జట్టు వన్డే సిరీస్ ఆడుతోంది. తొలి వన్డేలో శ్రీలంక బోణీ కొట్టగా, రెండో వన్డేలో భారత్ విజయభేరీ మోగించింది. ఈ క్రమంలో మూడో వన్డే మ్యాచ్ విశాఖ వేదికగా ఆదివారం జరుగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ సేన ఉవ్విళ్లూరుతోంది. 
 
మొహాలీలో జరిగిన రెండో వన్డేలో లంకేయుల్ని చిత్తుచిత్తుగా ఓడించిన భారత్ సిరీస్‌ను సమం చేసింది. దీంతో సిరీస్‌ ఫలితం కోసం మూడో వన్డే కీలకంగా మారింది. దాంతో ఆదివారం విశాఖ స్టేడియంలో జరిగే మూడో వన్డేలో గెలుపు కోసం ఇరు జట్లు తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాయి. మధ్యాహ్నం గం. 1.30 ని.లకు నిర్ణయాత్మక ఆఖరి వన్డే ప్రారంభంకానుంది.
 
గత ఏడాదిన్నర కాలంలో ఏడు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు ఆడిన టీమిండియా.. అన్నింటిల్లోనూ విజేతగా నిలిచి తమకు తిరుగులేదని నిరూపించింది. ఆ క్రమంలోనే మరొక సిరీస్‌పై దృష్టిసారించింది. ఇదిలా ఉంచితే, టెస్టు సిరీస్‌ గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత జట్టు.. శ్రీలంక కంటే  చాలా పటిష్టంగా ఉంది. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో టీమిండియానే మెరుగ్గా ఉంది. 
 
అయితే ఈ వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్‌ను కుప్పకూల్చిన శ్రీలంక తాము ఎంత ప్రమాదకరమో చెప్పకనే చెప్పింది. సంచలనాలకు మారుపేరైన లంకను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. టీమిండియా సమష్టిగా రాణిస్తేనే లంకను కట్టడి చేయడానికి ఆస్కారం ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వచ్ఛ మహానాడు, జీరో-వేస్ట్ ఈవెంట్‌.. 50వేల మంది ప్రతినిధులు హాజరు

వివాహేతర సంబంధం: 40 ఏళ్ల వివాహిత, 25 ఏళ్ల యువకుడు.. ఆపై ఆత్మహత్య.. ఎందుకు?

జపాన్‌ను దాటేసిన ఇండియా, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

భార్యాపిల్లలు ముందే బలూచిస్తాన్ జర్నలిస్టును కాల్చి చంపేసారు? వెనుక వున్నది పాకిస్తాన్ సైనికులేనా?!

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

తర్వాతి కథనం
Show comments