Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు యంగ్ ఇండియా వర్సెస్ శ్రీలంక : కొలంబో వేదికగా ఫస్ట్ వన్డే

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (09:44 IST)
భారత్ శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంక, యంగ్ ఇండియా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనుంది. 
 
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ టోర్నీలో కొత్త కుర్రాళ్లు తమ సత్తా చూపాలని ఆరాటపడుతున్నారు. తద్వారా టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించే జట్టులో తాము స్థానం సంపాదించాలని పృథ్వీషా, దీపక్ పడిక్కల్, సూర్యకుమార్ యాదవ్ లాంటి కుర్రాళ్లు భావిస్తున్నారు.
 
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రెగ్యులర్ జట్టు కాకుండా యంగ్ టీం బరిలోకి దిగుతుండగా.. తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీలంకలోని యంగ్ ఇండియాకు రాహుల్ ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
భారత జట్టు వివరాలు... ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, పడిక్కల్, రుతురాజ్, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, హార్దిక్, కృనాల్, నితీశ్ రాణా, ఇషాన్, సామ్సన్, చాహల్, గౌతమ్, కుల్దీప్, చక్రవర్తి, భువి, సైనీ, రాహుల్, దీపక్ చహర్, చేతన్ సకారియా.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments