Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై 17న కరోనా పాజిటివ్ కేసులెన్ని?

Advertiesment
Covid 19
, శనివారం, 17 జులై 2021 (11:05 IST)
దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో తగ్గుదల పెద్దగా కనిపించడం లేదు. ఒక రోజున 40 వేలకు పైగా కేసులు నమోదైతే మరోరోజు 40 వేలకు దిగువన నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 38,079 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,64,908కు చేరింది.
 
ఇకపోతే, కోవిడ్ బాధితుల మరణాల విషయానికొస్తే... శుక్రవారం 560 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,13,091కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,01,83,876 మంది కోలుకున్నారు. 4,24,025 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. రిక‌వ‌రీ రేటు 97.31 శాతంగా ఉంది.
 
ఇదిలావుంటే, దేశంలో గడిచిన 24 గంటల్లో మొత్తం 44,20,21,954 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. శుక్రవారం ఒక్క రోజే 19,98,715 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి మూత్ర విసర్జనకు వచ్చిన మహిళ... వెనుకనే గట్టిగా పట్టుకున్న కానిస్టేబుల్