Webdunia - Bharat's app for daily news and videos

Install App

దంబుల్లా వన్డే : శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో భారత్ గెలుపు

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన... ఇపుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, ఆదివారం దంబుల్లాలో వేదికగా జరిగిన త

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2017 (05:58 IST)
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన కోహ్లీ సేన... ఇపుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. ఇందులోభాగంగా, ఆదివారం దంబుల్లాలో వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 216 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని బ్యాట్స్‌మెన్లు డిక్‌వెల్లా 64, గుణ‌తిల‌క 35, కుశ‌ల్ మెండిస్ 36, కెప్టెన్ త‌రంగ 13, మాథ్యూస్ 36, క‌పుగెదెర 1, డిసిల్వా 2 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 217 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టు... 28.5 ఓవర్లలోనే 216 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించి 220 పరుగులతో విజయపరంపర కొనసాగించింది. ఓపెనర్ శిఖర్ ధవన్ 90 బంతుల్లో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
అలాగే, విరాట్ కోహ్లీ 70 బంతుల్లో 82 పరుగులు (నాటౌట్), రోహిత్ శర్మ 4 పరుగులతో జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును శిఖర్ ధవన్ అందుకున్నాడు. భారత బౌలర్లలో అక్షర్ ప‌టేల్ 3, య‌జువేంద్ర చాహ‌ల్ 2, కేదార్ జాద‌వ్ 2 వికెట్లు తీసి లంకేయుల నడ్డి విరిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి వేశ్యల రాజధాని అంటూ కామెంట్స్... మహిళా కమిషన్ సీరియస్

మహిళా జడ్జి మంగళసూత్రం మాయం.. లేడీ గ్యాంగ్‌స్టర్ అరెస్టు

మాగంటి గోపీనాథ్ భౌతికకాయం : మాజీ సీఎం కేసీఆర్ కంటతడి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ - కొత్తగా ముగ్గురుకి చోటు

కొడుకా... రూ.100 కోట్లు రాసిపెట్టాను.. లేవరా.... (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

తర్వాతి కథనం
Show comments