Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ నడ్డి విరిచిన సఫారీ బౌలర్లు.. ఆదుకున్న సూర్యకుమార్

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (18:14 IST)
ఐసీసీ ట్వంటీ20 టోర్నీలోభాగంగా, ఆదివారం పెర్త్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్‌‍ ఎంచుకుంది. అయితే, సౌతాఫ్రికా బౌలర్లు భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఫలితంగా 49 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 
 
ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఆపద్బాంధవ పాత్రను పోషించారు. ఒకవైపు సహచరులు వెనుదిరుగుతున్నా తాను మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి పరుగులు చేశారు. ఫలితంగా వంద పరుగుల మార్క్‌ను భారత్ దాటగలిగింది. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రాహల్ 9, రోహిత్ శర్మ 15, కోహ్లీ 12, హుడా 0, పాండ్యా 2 ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు చేరారు. ఫలితంగా 49 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లను కోల్పోయింది. సఫారీ బౌలర్లలో లుంగీ ఎంగిడి నాలుగు వికెట్లు తీశారు. 
 
కానీ సూర్యకుమార్ మాత్రం క్రీజ్‌లో పాతుకునిపోయి 68 పరుగులు చేశాడు. మొత్తం 40 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ 3 సిక్స్‌లు, ఆరు ఫోర్ల సాయంతో ఈ పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. కార్తీక్ 6, అశ్విన్ 7, భువనేశ్వర్ కుమార్ 4 చొప్పున పరుగులు చేయగా షమీ డకౌట్ అయ్యారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments