Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేప్‌టౌన్ వన్డే మ్యాచ్ : భారత్ ముంగిటి భారీ టార్గెట్

Webdunia
ఆదివారం, 23 జనవరి 2022 (19:47 IST)
కేప్‌టౌన్ వన్డేలో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ముంగిట సౌతాఫ్రికా భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీలో 49.5 ఓవర్లలో 287 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 
 
దక్షిణాఫ్రికా బౌలర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతంగా ఆడి సెంచరీ బాదాడు. మొత్తంమ 130 బంతులు ఎదుర్కొన్న డికాక్.. 12 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 124 పరుగులు చేశాడు. అలాగే, మిడిల్ ఆర్డర్‌లో రాస్సీ వాన్ డర్ డసెన్ 52, మిల్లర్ 39, డ్వేస్ 20 చొప్పున పరుగులు చేశారు. 
 
భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, దీపక్ చహర్ 2, జస్ప్రీత్ 2, చహల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించి వికెట్ నష్టానికి 16.2 ఓవర్లలో 82 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్. రాహుల్ కేవలం 9 పరుగులు చేసి మరోమారు నిరాశపరిచారు. ప్రస్తుతం శిఖర్ ధవాన్, విరాట్ కోహ్లీలు క్రీజ్‌లో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments