Webdunia - Bharat's app for daily news and videos

Install App

హామిల్టన్ ట్వంటీ20 : భారత్ ముంగిట 213 లక్ష్యం

Webdunia
ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (14:17 IST)
హామిల్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ ముంగిట 213 పరుగుల విజయలక్ష్యాన్ని ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ముంచింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడారు.

ముఖ్యంగా, సీఫెర్ట్, మన్రో, గ్రాండ్‌హోం వంటి ఆటగాళ్లు చెలరేగిపోవడంతో 20 ఓవర్లలో న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఓపెనర్లు సీఫెర్ట్, మన్రో 7.4 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. మన్రో కేవలం 40 బంతుల్లోనే 5 సిక్స్‌లు, 5 ఫోర్లతో 72 పరుగులు చేశాడు. మరోవైపు సీఫెర్ట్ కూడా కేవలం 25 బంతుల్లో 3 సిక్స్‌లు, 3 ఫోర్లతో 43 పరుగులు చేశాడు. 
 
అత్యంత ప్రమాదకారిగా కనిపిస్తున్న అతన్ని ధోనీ ఓ మెరుపు స్టంపింగ్‌తో ఔట్ చేశాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ తప్ప మిగతా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. కృనాల్ పాండ్యా అయితే 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు ఇచ్చాడు. హార్దిక్ 4 ఓవర్లలో 44 పరుగులు, భువనేశ్వర్ 37 పరుగులు, ఖలీల్ అహ్మద్ 47 పరుగులు ఇచ్చారు. 
 
కుల్దీప్ మాత్రమే 4 ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. గ్రాండ్‌హోమ్ 30, విలియమ్సన్ 27 పరుగులు చేశారు. కివీస్ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్ గెలవాలని అనుకుంటున్న టీమిండియాకు ఈ భారీ స్కోరు చేజ్ చేయడం పెద్ద సవాలే. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments