ఐసీసీట్వంటీ20 ప్రపంచ కప్ టోర్నీలోభాగంగా, బుధవారం భారత్ మరో కీలక మ్యాచ్ను ఆడనుంది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి దర్జాగా సెమీస్లో అడుగుపెట్టాలన్న ఆకాంక్షతో టీమిండియా సభ్యులు ఉన్నారు. ఒకవేళ ఈ మ్యాచ్ ఓడితో భారత్ సెమీస్ ప్రవేశం కోసం శ్రమించాల్సివుంటుంది.
అయితే, ఈ కీలక మ్యాచ్కు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా, భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండింటిలో గెలుపొందింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమిని చవిచూసింది.