Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు మరో షాక్ : టెస్ట్ సిరీస్ నుంచి షమీ దూరం

Webdunia
ఆదివారం, 20 డిశెంబరు 2020 (15:59 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెస్ట్ సిరీస్ నుంచి భారత పేసర్ మహ్మద్ షమీ దూరమయ్యాడు. గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌ నుంచి వైదొలిగాడు. 
 
ఈ నెల 17వ తేదీ నుంచి జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో శనివారం రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పాట్ కమిన్స్‌ వేసిన బౌన్సర్ షమీ కుడి చేతికి తగలడంతో అతను గాయపడ్డాడు. దీంతో ఆట మధ్యలోనే రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. 
 
తీవ్ర నొప్పితో బాధపడిన షమీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ నిర్వహించారు. తన చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు డాక్టర్లు తెలపడంతో షమీ సిరీస్‌లోని ఆఖరి మూడు టెస్టులకు దూరంకానున్నాడు. 
 
'షమీ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. అందుకే అతడు క్రీజులో బ్యాట్‌ను పట్టుకొని పైకి ఎత్తలేకపోయాడు. గాయం తీవ్రత పెద్దదేనని' షమీ సన్నిహిత వర్గాల సమాచారం. కాగా, తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓడిపోయిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

తర్వాతి కథనం
Show comments