కాన్‌బెర్రా వన్డే మ్యాచ్ : చెలరేగి ఆడిన పాండ్యా - జడేజా

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (13:06 IST)
కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు చెలరేగి ఆడారు. కేవల 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు ఆదుకున్నారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 302 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా కేవ‌లం 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 ప‌రుగులు జోడించారు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. 
 
మెల్ల‌గా మొద‌లుపెట్టి చివ‌ర్లో చెల‌రేగిపోయారు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, ఓ సిక్స్ బాద‌గా.. జ‌డేజా 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం. 108 బంతుల్లో 150 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ అజేయంగా నిలిచారు. 
 
అంత‌కుముందు ఓపెన‌ర్లు ధావ‌న్ (16), శుభ్‌మ‌న్ గిల్ (33) విఫ‌ల‌మైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిడిలార్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (19), రాహుల్ (5) కూడా నిరాశ‌ప‌రిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sarpanch Post: ఆమెను వివాహం చేసుకున్నాడు.. సర్పంచ్ పదవికి పోటీ చేయించాడు..

సీనియర్ ఐఏఎస్ అధికారి కుమార్తె పెళ్లైన కొన్ని నెలలకే ఆత్మహత్య.. ఏమైంది?

షాక్, పానీపూరీ తినేందుకు నోరు బాగా తెరిచింది, దవడ ఎముక విరిగింది (video)

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు ఇల్లు కట్టుకోవడానికి వేరే వాళ్ల కొంప కూలుస్తావా? పూనమ్ కౌర్ ట్వీట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

తర్వాతి కథనం
Show comments