Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్‌బెర్రా వన్డే మ్యాచ్ : చెలరేగి ఆడిన పాండ్యా - జడేజా

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (13:06 IST)
కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు చెలరేగి ఆడారు. కేవల 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు ఆదుకున్నారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 302 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా కేవ‌లం 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 ప‌రుగులు జోడించారు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. 
 
మెల్ల‌గా మొద‌లుపెట్టి చివ‌ర్లో చెల‌రేగిపోయారు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, ఓ సిక్స్ బాద‌గా.. జ‌డేజా 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం. 108 బంతుల్లో 150 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ అజేయంగా నిలిచారు. 
 
అంత‌కుముందు ఓపెన‌ర్లు ధావ‌న్ (16), శుభ్‌మ‌న్ గిల్ (33) విఫ‌ల‌మైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిడిలార్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (19), రాహుల్ (5) కూడా నిరాశ‌ప‌రిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments