Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ ఖాతాలో అరుదైన రికార్డు : 12 వేల రన్స్ పూర్తి

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (11:17 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో కాన్‌బెర్రా వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో కోహ్లీ 12 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నారు. 
 
భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అనేక రికార్డులను వరుసగా అధిగమిస్తూ వస్తున్న కోహ్లీ... ఈ దఫా, అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరిన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 
 
ఈ గేమ్ ప్రారంభానికి ముందు 11,977 పరుగుల వద్ద ఉన్న కోహ్లీ, మరో 33 పరుగులు సాధించడం ద్వారా ఈ మైలురాయిని చేరుకోగా, అందుకు 242 వన్డే ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. గతంలో కోహ్లీ పేరిట ఈ రికార్డు ఉంది. 
 
సచిన్ తన 300వ ఇన్నింగ్స్‌లో 12 వేల పరుగుల మైలురాయిని తాకాడు. మొత్తం 463 ఇన్నింగ్స్ ఆడిన సచిన్, తన ఖాతాలో 18,426 పరుగులను వేసుకోగా, ఆ రికార్డును కూడా కోహ్లీ అధిగమించే అవకాశాలు ఉన్నాయని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
 
తన 205వ ఇన్నింగ్స్‌లో 10 వేల పరుగుల మైలురాయిని తాకిన కోహ్లీ, ఆపై 17 ఇన్నింగ్స్‌లలోనే మరో 1000 పరుగులు చేశాడు. దాని తర్వాత మరో 1000 పరుగులకు 22 ఇన్నింగ్స్‌లను తీసుకున్నాడు. ఇదే ఊపుతో కొనసాగితే, మరో 150 ఇన్నింగ్స్‌లలోనే సచిన్ చేసిన పరుగులను కోహ్లీ దాటే వీలుంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

పాకిస్థాన్ వంకర బుద్ధి.. కవ్వింపు చర్యలు.. ఆరు డ్రోన్లను కూల్చివేసిన భారత్

భార్య సోదరితో భర్త వివాహేతర సంబంధం: రోడ్డుపై భర్తపై దాడికి దిగిన భార్య (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం... ఉత్తరాంధ్రకు భారీ వర్షం

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

కమల్ హాసన్, రజనీకాంత్‌లపై లోకేష్ కనగరాజ్ దమ్మున్న ప్రకటన చేశాడు

మునుపెన్నడూ లేని విధంగా స్క్రీన్‌లపై కింగ్‌డమ్ విడుదల కాబోతోంది

తర్వాతి కథనం
Show comments