Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశాంత్‌కు మళ్లీ బంతి పట్టే అవకాశం.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (10:42 IST)
కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ మళ్లీ బంతి పట్టుకోనున్నాడు. ఏడేళ్ల నిషేధం తర్వాత క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో శ్రీశాంత్ ఆడనున్నాడు. దీంతో మళ్ళీ బంతితో మయా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అందుకోసం ప్రెసిడెంట్స్ కప్ టీ 20 టోర్నీ వేదికగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వచ్చేనెల 17న ఈ టోర్ని మెుదలుకానుంది. ఈ బిగ్ టోర్నిలో కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ జట్లు పోటి పడనున్నాయి. 
 
ఈ టోర్నీలో ఏడేళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడుతున్నానని.. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ శ్రీశాంత్ ట్విటర్ ద్వారా తన హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు.
 
ఏడేళ్ల తర్వాత మళ్లీ బంతిని తిప్పే అవకాశం వచ్చిందని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. అమితంగా ఇష్టపడే క్రికెట్‌లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నం చేస్తున్నానని ట్వీట్ చేశాడు. శ్రీశాంత్ చేసిన ట్వీట్‌పై సురేశ్ రైనా స్పందించారు. 'గుడ్ లక్ మై బ్రదర్' అంటూ శ్రీశాంత్‌ను విషెస్ తెలియజేశాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్‌పై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 
2013 ఐపీఎల్‌లో అతని ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరొపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు తరుపున ఆడుతున్న శ్రీశాంత్‌పై నిషేదం విధించారు. అతనితో పాటు అజిత్ చండేలా, అంకిత్ చవాన్‌లను కూడా బ్యాన్ చేశారు. ఈ ఘటనపై పలు సార్లు శ్రీశాంత్‌ ఆప్పీల్ చేసుకున్నప్పటికి ఎలాంటి సానుకూలంగా ఫలితం లేకపోయింది. అతని విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ గత సంవత్సరం అతని నిషేదాన్ని ఏడేళ్లకు కుదించారు. సెప్టెంబరుతో ఆ బ్యాన్ ముగిసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments