Webdunia - Bharat's app for daily news and videos

Install App

హమ్మయ్య.. భారత్ ఖాతాలో విజయం.. మూడో వన్డేలో ఆసీస్ చిత్తు (video)

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:09 IST)
భారత్ ఖాతాలో మరో విజయం నమోదైంది. కాన్‌బెర్రా వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో మూడు మ్యాచ్‌లో వన్డే సిరీస్‌ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. తొల రెండు మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. 
 
కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు చెలరేగి ఆడారు. కేవల 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు ఆదుకున్నారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 302 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా కేవ‌లం 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 ప‌రుగులు జోడించారు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. 
 
మెల్ల‌గా మొద‌లుపెట్టి చివ‌ర్లో చెల‌రేగిపోయారు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, ఓ సిక్స్ బాద‌గా.. జ‌డేజా 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం. 108 బంతుల్లో 150 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ అజేయంగా నిలిచారు. 
 
అంత‌కుముందు ఓపెన‌ర్లు ధావ‌న్ (16), శుభ్‌మ‌న్ గిల్ (33) విఫ‌ల‌మైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిడిలార్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (19), రాహుల్ (5) కూడా నిరాశ‌ప‌రిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే.
 
ఆ తర్వాత 303 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ జట్టు 49.3 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగుల‌కు ఆలౌటైంది. క‌ళ్లు చెదిరే షాట్ల‌తో మ‌రోసారి మ్యాక్స్‌వెల్ భ‌య‌పెట్టినా.. కీల‌క‌మైన స‌మ‌యంలో అత‌న్ని పెవిలియ‌న్‌కు పంపించి మ్యాచ్‌ను భార‌త్ వైపు పేసర్ జస్ప్రీత్ మ‌లుపుతిప్పాడు. 
 
మ్యాక్స్‌వెల్ కేవ‌లం 38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 59 ప‌రుగులు చేశాడు. విజ‌యానికి మ‌రో 33 బంతుల్లో 35 ప‌రుగులు అవ‌స‌ర‌మైన స‌మ‌యంలో బుమ్రా యార్క‌ర్‌కు క్లీన్‌బౌల్డ‌య్యాడు. ఆ త‌ర్వాత ఆస్ట‌న్ అగార్ 28 బంతుల్లో 28 ప‌రుగులు చేసి పోరాడినా.. ఆసీస్ గ‌ట్టెక్క‌లేక‌పోయింది. అంత‌కుముందు కెప్టెన్ ఫించ్ త‌న అద్భుత‌మైన ఫామ్‌ను కొనసాగించాడు. 82 బంతుల్లో 75 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు. టీమిండియా బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ 3, బుమ్రా, న‌ట‌రాజ‌న్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lord Buddha: 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చిన బుద్ధుని పవిత్ర అవశేషాలు

అభ్యంతరకర వీడియోలు - 43 ఓటీటీలను నిషేధించిన కేంద్రం

ఆగస్టు ఒకటో తేదీ నుంచి నో హెల్మెట్ - నో పెట్రోల్

Bengaluru: విద్యార్థులకు మెట్రో పాస్‌లు, ఫీడర్ బస్సులు ఇవ్వాలి.. ఎక్కడ?

Chandrababu: ముగిసిన చంద్రబాబు సింగపూర్ పర్యటన- అమరావతికి తిరుగుముఖం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

తర్వాతి కథనం
Show comments