Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాన్‌బెర్రా వన్డే మ్యాచ్ : చెలరేగి ఆడిన పాండ్యా - జడేజా

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (13:06 IST)
కాన్‌బెర్రా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు చెలరేగి ఆడారు. కేవల 152 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత్‌ను హార్దిక్ పాండ్యా, రవీంధ్ర జడేజాలు ఆదుకున్నారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లకు 302 పరుగులు చేసింది. 
 
ఈ మ్యాచ్‌లోనూ హార్దిక్ పాండ్యా కేవ‌లం 76 బంతుల్లో 92 ప‌రుగులు చేయ‌గా.. జ‌డేజా 50 బంతుల్లో 66 ప‌రుగులు చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి ఆరో వికెట్‌కు అజేయంగా 150 ప‌రుగులు జోడించారు. ఒక ద‌శ‌లో 152 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయిన టీమ్‌ను ఈ ఇద్ద‌రూ ఆదుకున్నారు. 
 
మెల్ల‌గా మొద‌లుపెట్టి చివ‌ర్లో చెల‌రేగిపోయారు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో హోరెత్తించారు. పాండ్యా 7 ఫోర్లు, ఓ సిక్స్ బాద‌గా.. జ‌డేజా 5 ఫోర్లు, 3 సిక్స‌ర్లు కొట్ట‌డం విశేషం. 108 బంతుల్లో 150 ప‌రుగులు జోడించి ఇద్ద‌రూ అజేయంగా నిలిచారు. 
 
అంత‌కుముందు ఓపెన‌ర్లు ధావ‌న్ (16), శుభ్‌మ‌న్ గిల్ (33) విఫ‌ల‌మైనా.. కెప్టెన్ కోహ్లి (63) హాఫ్ సెంచ‌రీ చేశాడు. మిడిలార్డ‌ర్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (19), రాహుల్ (5) కూడా నిరాశ‌ప‌రిచారు. ఈ మ్యాచ్‌కు టీమిండియా ఏకంగా నాలుగు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments