Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాయాదుల సమరం... రికార్డ్ బద్ధలు.. ఆ మ్యాచ్‌ను బీట్ చేసింది...

Webdunia
శుక్రవారం, 26 నవంబరు 2021 (10:31 IST)
ఐసీసీ ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో భాగంగా దాయాదుల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ సమరం రికార్డు సాధించింది. భారత్‌లో అత్యధికంగా వీక్షించిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. దేశంలో స్టార్ ఇండియా నెట్‌వర్కులో ఏకంగా 15.9 బిలియన్ నిమిషాలపాటు ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ తాజాగా వెల్లడించింది. 
 
ప్రపంచవ్యాప్తంగా 10 వేల గంటలు లైవ్ కవరేజీ చేసినట్టు తెలిపింది. 2016 టీ20  ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సెమీస్‌ను అత్యధికమంది వీక్షించగా ఇప్పుడా రికార్డు బద్దలైంది. ఈ మ్యాచ్‌ను 60 శాతం ఎక్కువ మంది వీక్షించారు.  ఐసీసీ సామాజిక మాధ్యమాల ద్వారానూ అత్యధికమంది తిలకించారు. 618 మిలియన్ల మంది ఈ మ్యాచ్‌ను వీక్షించినట్టు ఐసీసీ వివరించింది.
 
పాకిస్థాన్‌లో పీటీవీ, ఏఆర్‌వై, టెన్‌స్పోర్ట్స్‌లు ప్రసారం చేయగా 7.3 శాతం మంది అధికంగా వీక్షించారు. ఆస్ట్రేలియాలో అయితే ఫాక్స్ నెట్‌వర్క్‌లో ఏకంగా 175 శాతం అధిక వీక్షణలు లభించినట్టు ఐసీసీ వివరించింది. 
 
అమెరికాలోనూ ఈ మ్యాచ్‌కు విశేష ఆదరణ లభించింది. ఈఎస్‌పీఎన్‌లో ప్రసారమైన భారత్-పాక్ మ్యాచ్‌ను గతంలో ఎన్నడూ లేనంతగా చూశారు. ఫేస్‌బుక్‌లోనూ ఈ లీగ్ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. 2019 వన్డే ప్రపంచకప్‌లో 3.6 బిలియన్ వ్యూస్ లభించగా, ఈ మ్యాచ్‌ ఆ రికార్డును బద్దలు చేస్తూ 4.3  బిలియన్ వ్యూస్ దక్కించుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

తర్వాతి కథనం
Show comments