సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిన భారత్... 2-0 తేడాతో సిరీస్ కైవసం

ఠాగూర్
బుధవారం, 26 నవంబరు 2025 (13:34 IST)
స్వదేశంలో భారత్ క్రికెట్ జట్టు చిత్తుగా ఓడిపోయింది. గౌహతి వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో విఫలమైంది. దీంతో 408 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఫలితంగా టెస్ట్ సిరీస్‌ను సఫారీలు 2-0 తేడాతో కేవసం చేసుకున్నారు. 
 
ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ముంగిట సౌతాఫ్రికా జట్టు 549 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ టార్గెట్‌మను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్... తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 140 పరుగులు మాత్రమే చేసింది. ఇందులో రవీంద్ర జడేజా చేసిన 54 పరుగులే అత్యధికం కావడం గమనార్హం. ఫలితంగా సౌతాఫ్రికా జట్టు 408 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. 
 
ఈ విజయంతో 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఫలితంగా సౌతాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్‌కు గురైంది. సఫారీ బౌలర్లలో హార్మర్ 6, మహారాజ్ 2, ముత్తుసామి, మార్కో యాన్సన్ తలా ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 రన్స్ చేయగా, భారత్ 201 పరుగులుచేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీలు ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేశారు. భారత్ మాత్రం 140 పరుగులకే చేతులెత్తేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం పూజ షురూ

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments