Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై టెస్ట్ మ్యాచ్‌లో కివీస్ చిత్తు - భారత్ ఘన విజయం

Webdunia
సోమవారం, 6 డిశెంబరు 2021 (11:05 IST)
ముంబై వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 540 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 165 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఏకంగా 372 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో టెస్ట్ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
ఈ టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులు చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అలాగే కివీస్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 62 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో 165 పరుగులు చేసింది. 
 
ఫలితంగా భారత క్రికెట్ జట్టు ఏకంగా 372 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో అశ్విన్, జయంత్ యాదవ్, ఇతర బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ వెన్ను విరిచారు. అంతకుముందు 140/5 ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ జట్టు మిగిలిన ఐదు వికెట్లను గంటలోపే చేజార్చుకోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KA Paul: చిన్నవాడైన రామ్మోహన్‌కి ఏవియేషన్‌పై అవగాహన లేదు: కే.ఏ.పాల్

భారత్‌లో బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల నిలిపివేత!?

India: దేశంలో ఏడువేల యాక్టివ్ కేసులు.. ఏపీ, తెలంగాణల్లో కేసులెన్ని?

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు చిత్తూరు వాసులు మృతి

10 నిమిషాలు ఆలస్యమై విమానం ఎక్కలేకపోయింది, బతికి బైటపడింది

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

తర్వాతి కథనం
Show comments