Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోహిత్ శర్మను వెనక్కి నెట్టిన మిథాలీరాజ్.. నెం.1గా నిలిచింది..

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (12:21 IST)
మహిళల ట్వంటీ-20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ రాజ్ రోహిత్ శర్మ రికార్డును బ్రేక్ చేసింది. 47 బంతుల్లో ఏడు ఫోర్లతో 56 పరుగులు సాధించింది. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ (2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) రికార్డు సృష్టించి... అందరి కంటే ముందు వరుసలో నిలిచింది. 
 
మరోవైపు తాజా రికార్డుతో పురుషుల క్రికెట్‌లో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్‌ శర్మ(2,207 పరుగులు, 80 ఇన్నింగ్స్‌లు) రికార్డును మిథాలీ అధిగమించినట్లయింది. రోహిత్‌ తర్వాత సారథి విరాట్‌ కోహ్లీ (2,102 పరుగులతో) భారత్‌ తరఫున రెండో స్థానంలో ఉన్నాడు.
 
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ ట్వంటీ-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇకపోతే.. మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత మహిళల జట్టు గురువారం ఐర్లాండ్‌ జట్టుతో తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

తర్వాతి కథనం
Show comments