Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా.. క్రికెట్ ఆగినా.. అగ్రస్థానంలో భారత్...

Webdunia
బుధవారం, 29 జులై 2020 (09:49 IST)
ఐసీసీ ర్యాంకింగ్స్‌‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. కరోనా వచ్చినా.. క్రికెట్ ఆగినా.. టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. వెస్టిండీస్‌తో మాంచెస్టర్ వేదికగా మంగళవారం ముగిసిన ఆఖరి టెస్టులో గెలిచిన ఇంగ్లాండ్ టీమ్.. మూడు టెస్టుల సిరీస్‌ని 2-1తో చేజిక్కించుకోవడం ద్వారా ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నెం.3 స్థానానికి ఎగబాకింది.
 
పట్టికలో భారత్ 360 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆ తర్వాత వరుసగా ఆస్ట్రేలియా (296), ఇంగ్లాండ్ (226), న్యూజిలాండ్ (180), పాకిస్థాన్ (140) టాప్-5లో కొనసాగుతున్నాయి. ఆగస్టు 5 నుంచి ఇంగ్లాండ్, పాకిస్థాన్ మధ్య మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుండగా.. అప్పటి వరకూ ర్యాంక్‌ల్లో మార్పులు ఉండవు. 
 
2019, ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్‌ని ఐసీసీ ప్రారంభించగా.. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ రూపంలో మొత్తం తొమ్మిది దేశాలు పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంత గడ్డపై మూడు టెస్టు సిరీస్‌లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్‌లు ఆడనుంది. మొత్తంగా.. 27 సిరీస్‌ల్లో 71 టెస్టులు జరగనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

జీఎస్టీ ఆఫీసర్ ఇంట్లో చోరీ.. రూ.60లక్షల విలువైన నగదు, బంగారం, వజ్రాలు గోవిందా!

అమ్మ ఇంకా బతికేవుంది.. వచ్చి చంపెయ్.. ప్రియుడుకి ప్రియురాలు పిలుపు

ఆ ఐదు గ్రామాల ప్రజలకు న్యాయం చేయండి.. ప్రధానిని కోరిన కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

తర్వాతి కథనం
Show comments