Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్‌ వుండడట.. ఫ్యాన్స్‌కు షాక్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:00 IST)
కివీస్ పర్యటనలో టీమిండియా జట్టు అదరగొడుతోంది. టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై సత్తా చాటింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. 
 
అయితే ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ ఆడట్లేదనే షాకింగ్ నిజాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం వుందని ఇప్పటికే క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్వంటీ-20 సిరీస్‌లో గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments