Webdunia - Bharat's app for daily news and videos

Install App

కివీస్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్‌ వుండడట.. ఫ్యాన్స్‌కు షాక్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:00 IST)
కివీస్ పర్యటనలో టీమిండియా జట్టు అదరగొడుతోంది. టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై సత్తా చాటింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. 
 
అయితే ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ ఆడట్లేదనే షాకింగ్ నిజాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం వుందని ఇప్పటికే క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్వంటీ-20 సిరీస్‌లో గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments