కివీస్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్‌ వుండడట.. ఫ్యాన్స్‌కు షాక్

Webdunia
సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (19:00 IST)
కివీస్ పర్యటనలో టీమిండియా జట్టు అదరగొడుతోంది. టీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి విదేశీ గడ్డపై సత్తా చాటింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ఫామ్‌లో కివీస్ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. 
 
అయితే ఈ సిరీస్‌లో హిట్ మ్యాన్ రోహిత్ ఆడట్లేదనే షాకింగ్ నిజాన్ని బీసీసీఐ వెల్లడించింది. ఇటీవల అన్ని ఫార్మాట్లలోనూ అదరగొడుతున్న రోహిత్ శర్మ జట్టులో లేకపోవడం టీమిండియాపై ప్రభావం చూపే అవకాశం వుందని ఇప్పటికే క్రీడా పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ట్వంటీ-20 సిరీస్‌లో గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కాలి పిక్క గాయంతో వన్డే, టెస్టు సిరీస్‌లకు దూరమయ్యాడు. ఆదివారం కివీస్‌తో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండగా రోహిత్ శర్మ కండరాలు పట్టేయడంతో బ్యాటింగ్ కొనసాగించలేక పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. 
 
ఆ తర్వాత మైదానంలో దిగలేదు. ఈ నేపథ్యంలో, రోహిత్ గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని, న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, రెండు టెస్టులకు రోహిత్ దూరమవుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మళ్లీ ఘోర ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్.. బస్సు నుజ్జు నుజ్జు.. ఏమైంది?

మారేడుపల్లి అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్.. ఆరుగురు మావోలు హత్

శ్రావ్య... నీవు లేని జీవితం నాకొద్దు... భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య

ఆ గ్రామ మహిళలు యేడాదికో కొత్త భాగస్వామితో సహజీవనం చేయొచ్చు.. ఎక్కడో తెలుసా?

ప్రధాని పుట్టపర్తి పర్యటన.. ప్రశాంతి నిలయానికి 100 గుజరాత్ గిర్ ఆవులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments