Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌ ఆర్చరీలో భారత్ ఖాతాలో మరో కాంస్యం

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (22:28 IST)
Harvinder singh
పారాలింపిక్స్‌ ఆర్చరీలో భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం లభించింది. ఆర్చరీలో హర్విందర్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుని ఈ విభాగంలో భారత్‌కు తొలి పతకం అందించాడు. 
 
దక్షిణ కొరియా ఆటగాడు కిమ్ మిన్ సుతో జరిగిన కాంస్య పతక పోరులో విజయం సాధించిన హర్విందర్ పతకం సాధించాడు. ఫలితంగా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య 13కు పెరిగింది. భారత్‌కు ఈ రోజు ఇది మూడో పతకం కావడం గమనార్హం. 
 
ప్రవీణ్ కుమార్, అవని లేఖర అంతకుముందు పతకాలు గెలుచుకున్నారు. పతకాల పట్టిలో భారత్ 2 స్వర్ణాలు, 6 రజత పతకాలు, 5 కాంస్య పతకాలతో 37వ స్థానంలో ఉంది. 
 
మరోవైపు, బ్యాడ్మింటన్ పురుషుల మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ జోడీ ప్రమోద్ భగత్, పాలక్ కోహ్లీ జోడీ సెమీ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. 
 
సింగిల్స్ ప్లేయర్, నోయిడా జిల్లా మేజిస్ట్రేట్ సుహాస్ యతిరాజ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఎస్ఎల్ 4 గ్రూప్ ఎ మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్ మాజుర్ చేతిలో ఓటమి పాలయ్యారు. 
 
కాగా, ప్రమోద్ భగత్-పాలక్ కోహ్లీ జంట రేపు (శనివారం) జరగనున్న సెమీస్‌లో హారీ సుసంటో- లీని రాత్రి‌తో తలపడతారు. పురుషుల సింగిల్స్‌లో సుహాస్, తరుణ్ ధిల్లాన్, మనో జ్ సర్కార్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack కుల్గాంలో ఎన్‌కౌంటర్: పెహల్గాం ఉగ్రవాదులేనా?

టర్కీలో భూకంపం... ప్రాణభయంతో పరుగులు తీసిన ప్రజలు

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

ప్రధాని మోడి వెనుక ప్రపంచ నాయకులు: టెర్రరిస్టుల ఫ్యాక్టరీ పీచమణిచే సమయం వచ్చేసిందా?

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

తర్వాతి కథనం
Show comments