Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకలో పర్యటించనున్న టీమిండియా - కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా!!

వరుణ్
గురువారం, 11 జులై 2024 (10:52 IST)
భారత క్రికెట్ జట్టు ఈ నెలాఖరులో శ్రీలంకలో పర్యటించనుంది. టీమిండియాకు కొత్త కోచ్‌గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రయాణం కూడా ఈ టూర్ నుంచి మొదలుకానుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లను ఆడనుంది. ఈ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు టీమిండియాకు కెప్టెన్‌‍గా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేశారు. 
 
జట్టుకు చెందిన సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని టీ20 సిరీస్‌కు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌‍గా బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ మేరకు బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. శ్రీలంకతో టీమిండియా జులై 27 నుంచి 30 వరకు 3 టీ20లు... ఆగస్టు 2 నుంచి 7 వరకు 3 వన్డేలను ఆడనుంది. 
 
ఇకపోతే, శ్రీలంకతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం ఖాయమని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్‌కు టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా బెర్తుల కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతుండడంతో, కేఎల్ రాహుల్‌‌కు ఆ ఫార్మాట్లో స్థానం కష్టమే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments