Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్వంటీ-20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్థాన్‌

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (12:25 IST)
కివీస్‍తో జరిగిన మూడు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌ను పాకిస్థాన్‌ క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20లో పాక్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో సిరీస్ 3-0తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఓపెనర్ బాబర్ ఆజమ్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. 
 
కివీస్ బౌలర్లను హడలెత్తించిన బాబర్ ఆజమ్ ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 58 బంతుల్లోనే 79 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఆసీస్‌తో జరిగిన ట్వంటీ-20 సిరీస్‌ను కూడా పాకిస్థాన్ వైట్‌వాష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కివీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ అదరగొట్టింది. ధాటిగా ఆడిన మహ్మద్ హఫీజ్ 4ఫోర్లు, రెండు సిక్సర్లతో 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో పాక్ స్కోరు 166కు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 16.5 ఓవర్లలో కేవలం 119 పరుగులకే కుప్పకూలింది. 
 
ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్ విలియమ్సన్ 38 బంతుల్లో 8ఫోర్లు, రెండు సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. ఓపెనర్ ఫిలిప్ (26), ఐష్ సోధి 11(నాటౌట్) తప్ప మిగతావారు కనీసం రెండంకెలా స్కోరును అందుకోలేక పోయారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ మూడు, ఇమాద్ వసీం, వఖాద్ మక్సూద్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

తర్వాతి కథనం
Show comments