Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (11:49 IST)
ఈడెన్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బౌలర్లు చెలరేగడంతో వెస్టిండీస్‌ను నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 109 పరుగులకే కట్టడి చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదనలో ఆదిలో కొంచెం తడబడింది. ఆ తర్వాత కార్తీక్, కృనాల్‌లు రాణించడంతో రోహిత్ సేన సునాయాసంగా గెలిచింది. 
 
ఇక ఈ మ్యాచ్ గెలుపోటములు అటుంచితే… విండీస్ క్రికెటర్లు చేసిన ఓ పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ నవ్వులు పూయిస్తోంది. అసలేం జరిగిందంటే… ఇన్నింగ్స్‌లో బుమ్రా వేసిన నాల్గో ఓవర్‌లో కరేబియన్ ఆటగాళ్లు హెట్‌మైర్‌, హోప్ తడబడి రనౌట్ రూపంలో వికెట్ పారేసుకున్నారు. హెట్‌మైర్‌తో కోఆర్డినేషన్ సరిగా లేకపోవడంతో  షై హోప్‌ రనౌటయ్యాడు.
 
ఈ రనౌట్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. డ్యూట్ ఇది క్రికెట్ బాస్.. రన్నింగ్ రేస్ కాదూ, ఎందుకు ఇద్దరు ఒకే అమ్మాయి కోసం పరుగెడుతారు, బీజేపీ అండ్ కాంగ్రెస్ రేస్, హెట్‌మైర్‌ విన్ ది రేస్ అంటూ ఛలోక్తులు విసురుతున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments